శ్రీ రుక్మిణి సత్యభామ సమేత జీర్ణోదరణ మహా కుంభాభిషేకం
మహా కుంభాభిషేకానికి భక్తులు అధిక సంఖ్యలో తరలి రండి.
చిత్తూరు జిల్లా/ తవణంపల్లి అక్టోబర్ 31.
చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం తవణంపల్లి మండల పరిధిలోని మత్యం జోగివారిపల్లె గ్రామంలో రుక్మిణి సత్యభామ సమేత శ్రీ కృష్ణ స్వామి వారి దేవస్థానం నందు (భజన మందిరం ) జీర్ణోదారణ మహా కుంభాభిషేకం 01-11-2025 శనివారం నుండి 02-11-2025 ఆదివారం వరకు నిర్వహించబడునని దేవస్థాన కమిటీ సభ్యులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 02-11- 2025 ఆదివారం ఉదయం 6 గంటల పైగా 7 గంటలకు లోగా జీర్ణఉద్దారణ కుంభాభిషేకం జోగివారిపల్లి గ్రామంలో వెలసిన శ్రీ రుక్మిణి సత్యభామ సమేత జీర్ణోదరణ మహా కుంభాభిషేకం జరుపబడునని ఆలయ నిర్వహకులు తెలిపారు. కావున భక్తాదులు పరిసర చుట్టుపక్కల గ్రామస్తులు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేసి స్వామివారి కృపకు పాత్రులు కాగలరని ఆలయ నిర్వాహకులు తెలియజేశారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0