ఆధునిక పరిజ్ఞానంతో నిర్మించిన ‘ఐఎన్ఎస్ నిస్తార్’ నౌకను జాతీకి అంకితం చేసిన కేంద్రమంత్రి సంజయ్ సేథ్
ఆధునిక పరిజ్ఞానంతో నిర్మించిన ‘ఐఎన్ఎస్ నిస్తార్’ నౌకను విశాఖపట్నంలో కేంద్రమంత్రి సంజయ్ సేథ్ జాతీకి అంకితం చేశారు.
ప్రత్యేకతలు:
- ఆపదలో చిక్కుకునే జలాంతర్గాములను రక్షించడానికి ప్రత్యేక డైవింగ్ టీమ్,
- బహుళపక్ష వినియోగ డెక్లు,
- హెలికాప్టర్
హిందుస్థాన్ షిప్ యార్డులో నిర్మించిన ఈ నౌక 10,500 టన్నుల బరువు, 120 మీటర్ల పొడవు ఉంటుంది. దీని తయారీకి 80 శాతానికిపైగా స్వదేశీ పరిజ్ఞానాన్ని వినియోగించారు. పూర్తి రిమోట్ ఆధారంగా పని చేసే వెసల్ అని నేవీ వర్గాల వెల్లడించాయి. తూర్పు నౌకాదళ ముఖ్య కార్యాలయం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో భారత నేవీ అడ్మిరల్ దినేష్ కె.త్రిపాఠి తదితరులు హాజరయ్యారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
1