పొద్దున్నే మోగింది అలారం…
కానీ లేచేది మనసు కాదు,
ఫోన్ స్క్రీన్ వెలుగే ముందుగా
కళ్లలో ఉదయాన్ని నింపుతోంది…
వేల కాంటాక్టులు ఫోన్‌లో ఉన్నా
ఒక మనసు మాత్రం కాల్ చేయదు –
“ఎలా ఉన్నావు?” అని అడిగే
ఆ ఆత్మీయ స్వరం మాయమైంది…
ఇంటి గోడలు పెరిగాయి,
కానీ గది నవ్వులు తగ్గాయి…
డైనింగ్ టేబుల్ పెద్దదైంది,
కానీ కలిసి తినే మనుషులు చిన్నబడ్డారు…
సెల్ఫీలు వేలకొద్దీ,
కానీ సంతోషం ఒక్కటే లేదు…
సోషల్ మీడియాలో చిరునవ్వు,
జీవితంలో మాత్రం నిశ్శబ్దం…
బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతోంది,
కానీ నిద్ర తగ్గుతోంది…
పదవులు ఎక్కుతున్నాం,
కానీ శాంతి దిగిపోతోంది…
ఒక రోజు…
అద్దంలో మనమే మనల్ని అడిగాం –
“ఇంత పరుగెత్తింది ఎవరి కోసం?”
జవాబు రాకపోయినా,
కళ్లలో నీళ్లు వచ్చాయి…
ఆ రోజు తెలిసింది –
డబ్బు జీవితం కాదు…
మనుషులే జీవితం…
మనసే నిజమైన సంపద…

రచన మంజుల పత్తిపాటి( కవయిత్రి)
మాజీ ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్
యాదాద్రి భువనగిరి జిల్లా
తెలంగాణ రాష్ట్రం
 చరవాణి 9347042218