యానం. మహి న్యూస్, మార్చి 25 :కేంద్రపాలిత ప్రాంతమైన యానం అసెంబ్లీ నియోజకవర్గానికి ఏప్రిల్ 9న జరగనున్న ఎన్నికల్లో టీ వి కె పార్టీ ప్రకటించిన ఎన్నికల హామీలపై ప్రజలు మొగ్గుచూపులునట్లు ఎన్నికల ప్రచారంలో  వెళ్లడవుతుంది దీనిపై ఓటర్లు ఆరా తీస్తున్నారు  టీ వి కే పార్టీ అభ్యర్థి తోటరాజు నాయకులు కార్యకర్తలు అభిమానులు భారీ ఎత్తున ఇంటింటా ఎన్నికల ప్రచారంలో ఎన్నికల హామీల కరపత్రాలను జోరుగా పంపిణీ చేస్తున్నారు బుధవారం ఉదయం స్థానిక ఓల్డ్ రాజీవ్ నగర్ , జిఎంసి బాలయోగి నగర్ శాలికోట, పెరి రోడ్ లోని వెంకటరత్న నగర్, వీరభద్ర నగర్ లలో విస్తృతంగా ఇంటింటా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు టీవీకే పార్టీ అభ్యర్థి తోటరాజుకు ప్రజలు స్వాగతిస్తున్నారు పూలమాలలువలతో సత్కరించడమే కాకుండా వీర తిలకాల దిద్ది విజయం సాధించాలని ఆశీర్వదిస్తున్నారు గతంలో ఉన్న నాయకులు ఎన్నికల హామీలు ఇచ్చి గెలిచిన తర్వాత ప్రజల ముఖం చూడని దుస్థితి యానంలో ఉందని ఇచ్చిన హామీలను గెలిచిన తర్వాత అమలు చేసేందుకు కృషి చేయాలని ప్రజలు ఆయన వద్ద వాపోతున్నారు  ఒక నాయకుడు గత ఎన్నికల్లో మహిళలకు వాషింగ్ మిషన్ ఇస్తానన్నారని గెలిచిన తర్వాత ఆ ఊసే లేదని, మరో నాయకుడు కలర్ టీవీలు ఇస్తానని డబల్ కాట్ మంచాలు ఇస్తానని ఇంటింటా గ్యాస్ కనెక్షన్ ఇస్తానని వృద్ధులను హెలికాప్టర్లో తిప్పుతానని హామీలు ఇచ్చి గాలికి వదిలేసారని ఆయన వద్ద వాపోతున్నారు ప్రజలకు ఇచ్చిన హామీల కోసం కడవరకు ప్రజల పక్షాన నిలిచి అమలు చేయాలని ఆయన ను కోరారు టీవీకే పార్టీ ఎన్నికల హామీలు ప్రజల్లో మంచి ఆకర్షణ గా నిలుస్తుందని ప్రజలు కితాబిస్తున్నారు ఈ ఎన్నికల ప్రచారంలో విత్తనాల సత్యనారాయణ బండారు పల్లంరాజు,కదిలి సుబ్రహ్మణ్యం,సూరంపూడి చంద్రశేఖర, కోన సూరిబాబు,తోట శ్రీను, తోట పెదకాపు,నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ ఎత్తున పాల్గొన్నారు..