వసంత విభావరిలో విరిసిన వెలుగుల వేళ,
పచ్చని ప్రకృతి పులకించి నవ్విన వేళ,
గడపల గర్భగృహమున మంగళ స్వరమై
తెలుగు తల్లి పండుగగా ఉగాది అవతరించె.
మామిడి తొరణాల పచ్చని తంతువులలో
ఆశల అలలు అలరిస్తూ ఊగుచుండగా,
వేప పుష్పాల చేదు గర్భిత గంధములో
జీవన సత్యాల గూఢార్థం మౌనమై నిలిచె.
కోకిల కంఠమున కలకల రాగములు
ప్రకృతి మంగళ ధ్వనులై పరిమళించగా,
వసంత సమీర మృదుస్పర్శ సన్నిధిలో
నూతన సంవత్సర స్వప్నాలు సుస్వాగతించె.
మామిడి–వేపల మేళన రసమూర్తిగా
ఉగాది పచ్చడి రూపమై వెలిసిన వేళ,
చేడు–తీపి–పులుపు–కారం–ఉప్పు రుచులలో
జీవిత చక్ర సత్యం ప్రతిధ్వనించె.
సంస్కృతి సుమములు వికసించు వేళ,
సంప్రదాయ దీపములు ప్రకాశించు వేళ,
ప్రకృతి–మనుజ బంధమది పావనమై
భూమి ఒడిలో నిత్యమై నిలిచియుండె.
అందుకే ప్రతి ఉగాది ప్రబోధమై,
పచ్చని మామిడి పుటల పలుకులలో,
వేప పుష్ప సుగంధ విరిసిన వేళ,
కోకిల గానామృత తరంగములలో,
ప్రకృతి సాక్షిగా మన జీవన గాథకు
కొత్త ఆది – కొత్త ఆశ – కొత్త మార్గమై నిలిచె.
ప్రకృతితో కలిసి జీవిస్తూ, మన సంస్కృతి–సంప్రదాయాలను కాపాడుతూ, కొత్త ఆశలతో ముందుకు సాగుదాం.
మీకు, మీ కుటుంబ సభ్యులకు హృదయపూర్వక ఉగాది శుభాకాంక్షలు.
రచన: మంజుల పత్తిపాటి
మాజీ ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్
యాదాద్రి భువనగిరి జిల్లా, తెలంగాణ రాష్ట్రం
📞 9347042218






Be the first to comment.