'ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ' పేరుతో అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా చేపట్టిన దాడులు ఇరాన్ సైనిక సామర్థ్యాన్ని దెబ్బతీశాయని రక్షణ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ ఆపరేషన్లో భాగంగా ఇరాన్కు చెందిన క్షిపణి లాంచర్లు, తయారీ కేంద్రాలు, రక్షణ వ్యవస్థలను ధ్వంసం చేయడంతోనే దాడుల తీవ్రత తగ్గిందని వారు చెబుతున్నారు.
ఈ పరిణామంపై ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు ఇయాన్ బ్రెమ్మర్ స్పందిస్తూ "ఇరాన్ క్షిపణి సామర్థ్యం దెబ్బతిన్న మాట వాస్తవమే అయినా, ఇది తాత్కాలికమే కావచ్చు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అనుసరిస్తున్న వ్యూహం ఇరాన్ను లొంగదీసేలా ఉన్నప్పటికీ, ఆ దేశం డ్రోన్ల ద్వారా సుదీర్ఘకాలం యుద్ధాన్ని కొనసాగించే ప్రమాదం ఉంది" అని హెచ్చరించారు.
యుద్ధం ఏడో రోజుకు చేరుకున్న నేపథ్యంలో ఇజ్రాయెల్ తాజాగా టెహ్రాన్పై భారీ స్థాయిలో దాడులు ప్రారంభించింది. ఈ దాడుల వల్ల ఇరాన్లో ఇప్పటివరకు 1,300 మందికి పైగా మరణించినట్లు సమాచారం. మరోవైపు, ఇరాన్ తన పట్టు నిలుపుకోవడం కోసం గల్ఫ్ దేశాలపై అడపాదడపా డ్రోన్ దాడులకు పాల్పడుతోంది. అమెరికా మాత్రం ఇరాన్ 'బేషరతుగా లొంగిపోవాల్సిందే'నని స్పష్టం చేస్తున్న నేపథ్యంలో, ఇది యుద్ధం ముగింపునకు సంకేతమా? లేక భారీ ప్రతిదాడికి ముందు ఇరాన్ వేసిన వ్యూహాత్మక అడుగా? అన్నది అంతర్జాతీయంగా ఉత్కంఠ రేపుతోంది.
| Header | Header | Header |
|---|---|---|
| Cell | Cell | Cell |
| Cell | Cell | Cell |



Be the first to comment.