ప్రపంచ కవిత్వ దినోత్సవం సందర్భంగా
వృక్షరాజుల వక్షస్థలమున్
వాయువు విహరించు వేళ,
మంజుల మానస సారమై
పత్తిపాటి పలుకు పరిమళించె;
ప్రకృతి పరిరక్షణే పరమధర్మం—
ప్రపంచ కవిత్వ దినోత్సవానికి
స్వాగతం పలుకుదాం రండీ॥
నీలాంబర తలపాగ మిద
నక్షత్ర హారముల కాంతి,
మంజుల కవిత్వ దీప్తిగా
పత్తిపాటి భావ రేఖలై మెరిసె;
భూమాత వేదన వినిపించున్—
స్వాగతం పలుకుదాం రండీ॥
సరిత్సాగర గర్భమున్
సంరక్షణ స్వరమెల్ల వినిపించగా,
మంజుల హృదయ తంత్రులపై
పత్తిపాటి రాగమాల విరిసె;
జలమే జీవన మూలం—
స్వాగతం పలుకుదాం రండీ॥
పుష్పిత వనరాజుల లోకమున్
పక్షి గానామృతమెల్ల పారగా,
మంజుల సుగుణ సాన్నిధ్యమై
పత్తిపాటి పద్య కుసుమముల విరిసె;
ప్రకృతి లాలనలోనే శాంతి—
స్వాగతం పలుకుదాం రండీ॥
భూమండల మాతృమూర్తి
బాధతో మౌనమై నిలిచిన వేళ,
మంజుల కరుణారస గంభీరమై
పత్తిపాటి వాక్యామృతమై పొంగె;
మనసారా కాపాడుదాం భూదేవిని—
స్వాగతం పలుకుదాం రండీ॥
✍️ రచన: మంజుల పత్తిపాటి
📞 చరవాణి: 9347042218
📍 యాదాద్రి భువనగిరి జిల్లా, తెలంగాణ





Be the first to comment.